- సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేసిన … ఆగని అక్రమ దందా
- కాంగ్రెస్ హయాంలో… బీఆర్ఎస్ నాయకుల హవా
- కాంగ్రెస్, బీఆర్ఎస్…. ములాఖాత్
- అంతా … ఇల్లీగల్
- అర్ధరాత్రి హంగామా .. సిఐకి ఫిర్యాదు
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివార్లో గల దుందుభి వాగు నుండి ఇసుకను అక్రమ రవాణా ఆగడం లేదని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజిఎండిసి అనుమతుల పేరిట గత నాలుగు నెలల నుండి నిబంధనల విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈనెల 9న ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ సంజయ్ సంబంధిత ఇతర శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు.
- కాంగ్రెస్, బీఆర్ఎస్…. ములాఖాత్
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల్ కొత్తపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు కుమ్ముకై ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఇసుక మాఫియాతో కాంగ్రెస్ హయాంలో టిఆర్ఎస్ నాయకులు హవా కొనసాగుతుందని మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో కోడైకొస్తుందని ఆయన విమర్శించారు.
- అంతా…… ఇల్లీగల్
మిడ్జిల్ మండలం కొత్తపల్లి ఇసుక మాఫియా పట్టపగలు, రాత్రి అని తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సర్వే నెంబర్ 97 లో గల ప్రభుత్వ భూముల్లో మోతాదుకు మించి 16, 18 టైర్ల లారీలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికారులు ఆ ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయని ఆయన విమర్శించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయతో పాటు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ప్రవీణ్ తెలిపారు.
- అర్ధరాత్రి హంగామా…. సిఐకి ఫిర్యాదు
ఈనెల 18న అర్ధరాత్రి దాదాపు 11 గంటల యాభై నిమిషాలకు ఇసుక మాఫియా కొత్తపల్లి ఇసుక రీచ్ లోకి టిప్పర్లు, జెసిబి తీసుకెళ్లి ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించగా అర్ధరాత్రి హంగామా చోటు చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా ఈ విషయమై టి ఎస్ ఎం డి సి పి ఓ జడ్చర్ల రూరల్ సిఐ కి ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. సీఐ కి టిఎస్ఎండిసి ఫిర్యాదు నేపథ్యంలో మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తరలిస్తుందని గతంలో నేను సైతం చేసిన ఆరోపణలు నిజమైన నీ స్పష్టమవుతుందని ప్రవీణ్ తెలిపారు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో విచారణ జరిపి మిడ్జిల్ ఇసుక మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.