మనోహరాబాద్–తూప్రాన్ డివిజన్ : ఎన్నికల ఆచరణ నియమావళి అమలు నేపథ్యంలో మోడల్ కోడ్ ప్రకారం కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై మనోహరాబాద్ అలాగే ఐడి పార్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల సమయంలో మనోహరాబాద్ పీఎస్ పరిధిలోని కల్లకల్ గ్రామం వద్ద అనుమానాస్పదంగా బైక్పై ప్రయాణిస్తున్న కుచారం గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ను అడ్డుకుని తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా అతని వద్ద చట్టబద్ధ ఆధారాలు లేని రూ. 5,00,000 నగదు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే విధి విధానాల ప్రకారం ఘటనాస్థలంలోనే పంచనామా నిర్వహించి సీజ్ మెమో సిద్ధం చేశారు. స్వాధీనం చేసిన మొత్తాన్ని సంబంధిత రికార్డుల్లో నమోదు చేసిన అనంతరం, తదుపరి చట్టపరమైన చర్యల కోసం టూప్రాన్ ఆర్డీవో అధికారికి అప్పగించారు.
ఎన్నికల ఆచరణ నియమావళి అమలులో భాగంగా అక్రమ రవాణా, అనధికార నగదు ప్రవాహం, ఇతర ఉల్లంఘనలను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరంగా కొనసాగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.










