చేగుంట : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని దాడిని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది అని బిఎస్పి చేగుంట మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్ అన్నారు. ఇటువంటి ఘటన సభ్యు సమాజానికి సిగ్గుచేటుఅని ఘటనకు పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారుని
పసి పాప మృతికి కారణమైన వారి పై BNS 316, BNS 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి నిందితుల పై చర్యలు తీసుకోవాలి అని కులవివక్షతో రజక కుటుంబం పై దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.








