తూప్రాన్ డివిజన్: మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు అయిన ఎంపీటీసీ, జెడ్పిటిసి, గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని, నేటి నుంచి జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఏలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లో సరైన వసతులు కల్పించాలన్నారు.
అధికారులను మహాత్మ జ్యోతిబా పాఠశాలలో ఉన్న గదులు, సెక్యూరిటీ, మౌలిక వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
