అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై అడుగు పెట్టిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ అభినందనలు తెలిపారు. సాహసోపేతమైన, చారిత్రాత్మక యాక్సియం-4 మిషన్ను శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో వారికి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
శుభాంశు ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని, భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉంటారని వి.సుధాకర్ కొనియాడారు. పైలట్ శుభాంశు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని, దేశానికి మరింత సేవ చేయాలని సుధాకర్ ఆకాంక్షించారు.