contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చిగురుమామిడిలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

  • లక్షలాది రూపాయలు దండుకుంటున్న అక్రమార్కులు..
  •  “కొండంత… దోపిడి”
  •  సుందరగిరి గుట్ట పరిసర ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..
  •  నిద్రాణ స్థితిలో దేవాదాయ, రెవెన్యూ అధికారులు.
  •  పెట్రేగిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు…
  •  అధికారుల కను సైగల్లోనే దందా..?

 

కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం: మట్టి మాఫియా రెచ్చిపోతుంది,కళ్ళు మూసి తెరిచేలోపు గుట్ట వెనుక భాగంలో పూర్తిస్థాయిలో మాయమైపోతున్న మోరం, ఎర్ర మట్టి తెల్లవారుజామున వచ్చి చూసి సరికి ఒక పక్కన గుట్ట ఉండేది అని భవిష్యత్ లో చెప్పుకోవడమే అవుతుందేమో,ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కొండలను,గుట్టలను కూడా లెక్క చేయకుండా పిండి చేసి నాశనం చేస్తున్నారు.ఇక ప్రశ్నించిన వారికి అధికారులే మాకు పర్మిషన్ ఇచ్చారు.. మీరెవ్వరు అడగటానికి అంటూ బెదిరింపులు దిగుతున్నారు.

ఈ భూమి మాదే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంటున్నారు. ఇదెక్కడో కాదు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో గల ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు వస్తుంటారు, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు మొక్కి కోరిన కోర్కెలు తీరడంతో మొక్కులు సమర్పించి గుడి ప్రాంగణం చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు గుట్టలు చుట్టూ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించి వెళుతుంటారు. దింతో ఇక్కడి భూముల విలువలు అమాంతంగా పెరిగిపోవడంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కన్ను గుట్టలపై పడింది. గుట్టలను ఎలాగైనా చదును చేసి ఇక్కడ ఫ్లాట్లను ఏర్పాటు చేసి అమ్ముకోవాలనే దరుద్దేశంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా గుట్టలను చదను చేసే పనిలో నిమగ్నమయ్యారు,దానికి తోడు అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా అడ్డు చేపితే మా వద్ద దీనికి సంబంధించిన పట్టా పాస్ బుక్కులు ఉన్నాయని చెబుతున్నారు.

ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులుకు తెలియడం లేదా? లేక తెలిసినా తెలియనట్టు వ్యవరిస్తున్నారా..? అనేది ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. ఒకవేళ మామూలుగా తీసుకోకపోతే గత నాలుగు రోజుల నుండి గుట్టను చదును చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై చర్యలను ఎందుకు తీసుకోవడం లేదని అధికారులపై పలువురు భక్తులు,గ్రామస్తులు మండిపడుతున్నారు.భూమి కోసమా…దాగివున్న ఆభరణాల కోసమా..?గుట్టను తవ్వేది భూమి కోసం కాదని పూర్వ కాలంలో ఆలయం గుట్టలో ఉండేదని అక్కడ బావి లోపల నిజాం నవాబుల కాలంలో బంగారు ఆభరణాలు వజ్ర వైడుర్యాలు దాచి పెట్టారని పూర్వీకులు చెబుతుండే వారు వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని వాటిపై కన్నేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాటికోసమే గుట్టలను కూడా చూడకుండా స్వాహా చేసేందుకు సిద్దమైయ్యరని అని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అడ్డుకోవాల్సిన అధికారులు కూడా వారికి వత్తాసు పలకడం ఏంటని అధికారులపై గ్రామస్తులు మండిపడుతున్నారు.గ్రామంలో ఎదైనా జరగరాని ముప్పు సంభవిస్తే భాద్యత వహించేది ఎవరని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.అధికారులు వారి వద్ద మామూలు తీసుకున్నారా?తెలియదు కానీ మామూళ్ల మత్తులో ఉంటే మాత్రం మత్తు వీడి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట కాపాడాలని కోరుతున్నారు.

◆ గుట్టను చదును చేసే వారిపై చర్యలు తీసుకుంటాం..  చిగురుమామిడి తహశీల్దార్  ముద్దసాని రమేష్.

ఈ విషయంపై రిపోర్టర్ టీవీ రిపోర్టర్ వివరణ కోరగా ఆలయగుట్టపై ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని. గుడి పరిసరాల ప్రాంతంలో ఉన్న గుట్టలను తొలగించే హక్కులు ఎవరికి లేదు.అది పట్టా భూములైన ఇతరత్రా భూములైన సరే ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :