కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదింటి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, అది కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. దహెగాం మండలం. ఇట్యాల, రాళ్లగూడెం, కొత్మీర్, గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కు భూమిపూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిరుపేదల సొంతంటి కల సాకారం ప్రజా ప్రభుత్వ యొక్క లక్ష్యం అని.ఇందులో ఎవరైనా దళారులు చేతివాటం ప్రయోగిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు ఉన్నారు.
