కరీంనగర్ జిల్లా: ఇటీవల జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పురుషోత్తం మంగళవారం నాడు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ని తిమ్మాపూర్ లో క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. వీరి వెంట మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు రవికుమార్, చక్రవర్తి లు కూడా ఉన్నారు.
