సంగారెడ్డి : వైద్యుల నిర్లక్ష్యం తో తల్లీ, శిశువు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో చోటు చేసుకుంది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి మొదటి కాన్పు కోసం ఈ నెల 20వ తేదీన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కిషన్ నాయక్ తండ వాసర్కు చెందిన రాథోడ్ రేణుక పురిటి నొప్పులు భరించకపోవడంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో చేర్పించారు. కాగా ఈ నెల 21న నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని , ఆపరేషన్ చేసి డెలివరీ చేయమని రేణుక కుటుంబ సభ్యులు డాక్టర్లకు తెలిపినట్టు రేణుక కుటుంబ సభ్యులు తెలిపారు . డాక్టర్లు మాత్రం రేణుకకు నార్మల్ డెలివరీ చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారని డాక్టర్లు తెలిపారు.
కాగా డెలివరీ సమయంలో రేణుకకు బీపీ, పిట్స్ వచ్చాయని, డెలివరీ చేసే క్రమంలో రేణుక మగ బిడ్డకు జన్మనిచ్చింది. జన్మించిన మగ బిడ్డ మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. కాగా రేణుక పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్పించారు. చికిత్స చేస్తుండగా రేణుక శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. గర్భిణీ రేణుక డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రేణుక మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రేణుక కుటుంబ సభ్యులు సంగారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీదర్ రెడ్డి కు వినతి పత్రం అందజేశారు.
