కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లోని మైలారం గ్రామంలో మునగ సాగు మరియు సాంకేతికత వ్యాప్తి తో పాటు ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించిన నాబార్డ్ ఏజీఎం మరియు నాబార్డు హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ నుండి జితేందర్ సింగ్ మేనేజర్ లు సందర్శించారు.నాబార్డ్ వారి సౌజన్యంతో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో మండలం లోని మైలారం గోపాల్పూర్, ఖాసీంపేట గ్రామాలతోపాటు చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో మునగ సాగు చేస్తున్న రైతుల రైతుల ఫీల్డ్ ను సందర్శించిన నాబార్డ్ అధికారులు. మైలారం గ్రామంలో ఆదర్శ రైతులు దంపతులు ముత్యాల రజిని రమణారెడ్డి ఫీల్డ్ మరియు మునగ పౌడర్ తయారీ వాటి యొక్క ఉపయోగాలు మరియు మునగ నర్సరీ తోపాటు మునగదారు వచ్చే విలువ దారితో ఉత్పత్తులు మునగ పౌడర్ మరియు మునగ కాడల ద్వారా పశువుల మేత తయారీ చేసే విధానాలపైన రైతులను అడిగి తెలుసుకున్నారు. నాబార్డ్ పైలెట్ ప్రాజెక్టు కింద ఫాం సెక్టర్ ప్రమోషన్ ఫండ్ ద్వారా మునగ ఆధారిత ఉత్పత్తుల తయారీ మరియు వాటి మార్కెటింగ్ విధానాల పైన రైతులు మునగ సాగు చేస్తున్న పద్ధతులు మరియు మునగదార వారి రైతుల ఆదాయం రెట్టింపు పై మార్గాల గురించి నవాడా అధికారులు ఏజీఎం జయప్రకాష్ మరియు మేనేజర్ జితేందర్ సింగ్ లకు జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి సంపత్ కుమార్ వివరించడం జరిగింది. వీటితోపాటు గోపాల్పూర్ మైలారం గ్రామాల రైతుల ఫీల్డ్ లను క్షేత్ర పర్యటన చేయడం జరిగింది.మునగా చాలా డిమాండ్ ఉన్న పంటగా ఇప్పుడు వస్తుంది దీని యొక్క ఉపయోగాలు మరియు వీటి ఆధారిత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నది. కావున రైతులు మైలారంలో త్వరలో ఏర్పాటు కాబోయే మునగా ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా బై ప్రొడక్ట్స్ తయారీ తోపాటు మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా మేడికొండ న్యూట్రియెంట్ వారితో జేవిఆర్ఏ సంస్థవారు మెమోరండమ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కావున రైతులు సేంద్రియ పద్ధతిలో మునగ సాగు ద్వారా అధిక లాభాలను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన వికాస ప్రతినిధి పెసరి రాజు,రైతులు ఆకుల సంతోష్, ఎన్నం సదానందం, దాడి మల్లయ్య, స్వరూప, బద్దం పవన్ రెడ్డి,ముత్యాల రమణారెడ్డి, రాజు రైతులు పాల్గొన్నారు.
