తిరుపతి రూరల్ మండల పరిధిలోని తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి, పాకాల, చంద్రగిరి, రామచంద్రాపురం, చిన్నగొట్టుగల్లు, యర్రావారిపాలెం మండలాలకు సంబందించిన పలువురికి సిఎంఆర్ఎఫ్ సహయనిధి ద్వారా సుమారు 23 లక్షల 17వేల 298 రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అనారోగ్య ,ఇతర సమస్యలతో బాధపడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే. తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనారోగ్య, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేసారు. కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన భాధిత కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
