అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు డి.ఎస్.పి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆత్మకూరు డిఎస్పీ కే. వేణుగోపాల్, సీఐ గంగాధర్, ఏ ఎస్ పేట చేజర్ల ఎస్సైలు, ఎక్సైజ్ శాఖ సిఐ ఆత్మకూరు అర్బన్ వైద్యశాల వైద్యురాలు ఆస్మా, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల.చంద్రరెడ్డి, ఎన్జీవో వాగాల శ్రీహరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు. మాదక దవ్యాలను అరికట్టాలంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు.. మున్సిపల్ బస్టాండ్ వద్ద ర్యాలీలో పాల్గొన్న అందరూ మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.
