నెల్లూరు జిల్లా : మర్రిపాడు మండలం,చుంచులూరు ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం జరిగిన పదవ తరగతి ఫలితాల్లో మొదటి ఐదు స్థానాలు సాధించిన లహరి,సమీరా,చరణ్,కీర్తి,శృతి లకు వరుసగా ఎనిమిది వేలు,ఏడు వేలు,ఆరు వేలు,ఐదు వేలు,నాలుగు వేలు వంతున చుంచులూరు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి చింతంరెడ్డి సిద్ధారెడ్డి,జయమ్మ ల కుమారుడు ప్రవాస భారతీయుడు సుదర్శన్ రెడ్డి దాతృత్వంతో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల మరోక పూర్వ విద్యార్థి బుగాట్టి షూ కంపెనీ నందు ప్రోడక్ట్ డెవలప్ మెంట్ మేనేజర్ గా పని చేస్తున్న దువ్వూరు సురేష్ కుమార్ విద్యార్థులకు రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చుంచులూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయడం అభినందనీయమనీ,విద్యార్థులు దాతల సహకారాన్ని అందిపుచ్చుకొని బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారి జొన్నా సత్యనారాయణ,మాజీ సర్పంచ్ దువ్వూరు జయదేవ్,గ్రామానికి చెందిన ఇరుకుమాటి మురళీధర్ రావు,ఓబులమ్మ,తంగేడుపల్లి సుబ్బయ్య,మల్లీశ్వరి,అశ్విని, ఉపాధ్యాయులు రమణయ్య,పెంచలరావు,మల్లిఖార్జున స్వామి,బాలాజీ,తిరుపాలు,రహీమ,రాజేంద్ర కుమార్,సునీత,గ్రామస్తులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
