ఒంగోలు – ప్రకాశం భవనంలో సోమవారం “స్వర్ణాంద్ర @ 2047” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా విద్యా-నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరత, సామాజిక అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి వంటి అనేక అంశాలపై చర్చలు జరగడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంత్ర డోలా బాలా వీరాంజనేయస్వామి ,జిల్లా కలెక్టర్ ఎ .తమీమ్ అన్సారియా , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ,జాయింట్ కలెక్టర్ శ్రీ గోపాల్ కృష్ణ రోనంకి ,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ , కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహా రెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మరియు జిల్లా ఆరోగ్య, వైద్య, విద్య ,సాంఘిక సంక్షేమ, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు.