contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాడేరులో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ

అల్లూరి జిల్లా పాడేరు : మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి చేటు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేసారు. జిల్లాలో గంజాయి సమూలంగా నిర్మూలించడానికి అందరూ సహాకారం అందించాలని పిలుపు నిచ్చారు.

గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సం (నషా ముక్తి భారత్ అభియాన్) సందర్భంగా ఐటిడి ఏ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో మాదక ద్రవ్యాల చెడు ప్రభావరం పై అందరికి అవగాహన ఉండాలన్నారు.

జిల్లా కేంద్ర లో 10 మందితో డీ ఎడిక్షన్ సెంటర్ ప్రారంభించామని, ప్రస్తుతం 150 మంది మత్తు విముక్తిపై వైద్యం అందిస్తున్నామన్నారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాల భారిన పడిన బాధితులు ఉంటే డీ ఎడిక్షన్ సెంటర్కు తరలించాలని సూచించారు. జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ సమావేశాలు, ఆశ్రమ పాఠశాలలు, యువ గ్రూపులు, సఖీ గ్రూపులలో గంజాయి సాగు, వినియోగంపై తీర్మానాలు చేయాలని సూచించారు.

గ్రామాలలో గడప గడపకు గంజాయి నిర్మూలన పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతీ 15 రోజులకు ఒక సారి గంజాయి సాగు నిర్మూలన పై చర్చ జరగాలన్నారు. అనంతరం డ్రగ్స్ వద్దు బ్రో అంటూ అందరితో నినాదాలు చేయించారు. మాదక ద్రవ్యాలు వినియోగించనని ప్రతిజ్ఞ చేయించారు.

ఎస్సీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో నషా ముక్తి భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేసారన్నారు. యోగాకు అల్లూరి సీతారామ రాజు జిల్లా సింబల్ గా మారిందన్నారు. గత ఏడాది 10 వేల ఎకరాల్లో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేయడానికి విత్తనాలు, మొక్కలు రైతులకు పంపిణీ చేసామన్నారు. స్మగ్లర్లు బయట ప్రాంతాల నుండి గిరిజన ప్రాంతానికి వచ్చి గిరిజనులను పక్కదారి పట్టించి మోసం చేస్తున్నారని చెప్పారు గంజాయి స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుని జైలు పంపిస్తామని హెచ్చరించారు. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి అందరూ సహకారం అందించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు.

మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ గిరిజనులు పుట్టుడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు. గంజాయి సాగు నిర్మూలనపై
గిరిజన గ్రామాలలో అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, మాదక ద్రవ్యాల నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టారని చెప్పారు.

జిల్లాలో గంజాయి సాగు నిర్మూలనకు పోలీసు అధికారులు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. చుట్టా, బీడి, గుట్కాలు, గంజాయి వినియోగించడం వలన చాలా మంది కాన్సర్ భారిన పడుతున్నారని అన్నారు. యువత మత్తు పదార్ధాల వినియోగానికి దూరంగా ఉండాలని చెప్పారు. పిల్లల ప్రవర్తన ఎటువైపు వెళుతున్నారో తలిదండ్రులు గమనించాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్సీ ధీరజ్, చింతపిల్లి ఎ ఎస్పీ నవజ్యోతి మిశ్రా, ఐసిడి ఎస్ పిడి ఝాన్సీ, ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్. గౌరీ శంకరరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.టి. హేమలతా దేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. టి. విశ్వేశ్వర నాయుడు, డి ఎసిపి షేక్ అహ్మద్ షెహబాజ్, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డా. పి. ఎస్. ఎన్.రాజు, స్థానిక నేతలు బొర్రా నాగరాజు, బొర్రా విజయరాణి, లగిశపల్లి సర్పంచ్ పార్వతమ్మ, సిడిపి ఓలు, పలువురు వైద్యాధికారులు, వైద్య విద్యార్ధులు, వివిద పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :