contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. పల్నాడు పోలీస్

పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సామాజిక మాధ్యమాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజున మరియు ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నిరాధార, అబద్ధపు సమాచారం ప్రసారం చేసిన వారిపై చట్టపరపమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది-పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఆర్ రాఘవేంద్ర గారు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున మరియు ఆ తర్వాత జరిగిన సంఘటనలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో చేసే అబద్ధపు ప్రచారాలను మరియు ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తాం

వాట్సాప్/టెలిగ్రామ్/ఫేస్ బుక్/ఇంస్టాగ్రామ్ మరియు ఇతర గ్రూపుల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే గ్రూప్ అడ్మిన్ దే పూర్తి బాధ్యత

ఎవరైనా ఇంతకు ముందు ఎప్పుడో జరిగిన సంఘటనలను ప్రస్తుతం జరిగిన సంఘటనలుగా చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పోస్ట్ చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొనబడతాయి. వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్లు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, సరైన సమాచారం లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరాధార, వాస్తవ దూరమైన పోస్ట్లు/వీడియోలు/వార్తలు సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అదనపు ఎస్పీ గారు హెచ్చరించారు

వాట్సాప్/టెలిగ్రామ్/ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్/ట్విటర్ (ఎక్స్) మరియు ఇతర గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా అనాలోచిత /తప్పుడు సమాచారం/ బెదిరింపులకు పాల్పడేవి పోస్ట్ చేయబడితే దానికి పూర్తి బాధ్యత గ్రూప్ అడ్మినే వహించాల్సి వస్తుందని తెలియజేసారు.

గ్రూప్ లో యాడ్ చేసే ప్రతి సభ్యుడు తప్పకుండా అడ్మిన్ కి తెలిసి ఉండాలని, ఎవరైనా సభ్యులు అభ్యంతకరంగా ప్రవర్తిస్తే వెంటనే గ్రూప్ నుండి తొలగించాలని, అభ్యంతకర, ఫేక్ న్యూస్, వదంతులుపై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని, వివాదస్పద పోస్టింగ్ సంబంధించి అడ్మిన్ చర్యలు తీసుకోకుంటే వారిపై ఐపిసి 153A మరియు సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

కుల, మత, వర్గ మరియు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేవి, తప్పుడు సమాచారం, అసభ్యకర, అభ్యంతర, నేరపూరితమైన మరియు బెదిరింపులకు పాల్పడేవి, వ్యక్తిగత పరపతి మరియు మనోభావాలు దెబ్బతీసే విధంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు/వీడియోలు, ప్రజలను తప్పుదారి పట్టించే సమాచారం ఇతరులకు ఎట్టి పరిస్థితిలో షేర్ చేయకూడదని కాదని ఎవరైనా షేర్ చేసిన ఎడల వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసభ్యకర, అభ్యంతరకర, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టింగులకు సంబంధించిన సమాచారం మీకు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేయాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని ఈ సందర్భంగా తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :