హైదరాబాద్. అరణ్య భవన్ లో పీసీసీఎఫ్( ప్రొటెక్షన్, విజిలెన్స్ & చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్) ఏలుసింగ్ మేరు ను కలిసిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు మరియు ముధోల్ శాసన సభ్యులు రామారావు పటేల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమురంభీం టైగర్ కంజర్వేషన్ రిజర్వు జీవో నం.49 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కుమురంభీం జిల్లాను టైగర్ కంజర్వేషన్ రిజర్వుగా ప్రకటించడంతో ఆదివాసీలు,గిరిజనేతరులు మరియు ప్రజల్లో అనేక అనుమానాలు అపోహలు ఏర్పడ్డాయని, ఈ టైగర్ కంజర్వేషన్ రిజర్వు జీవో వలన అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతుందని వెంటనే జీవో నం.49 ను నిలుపుదల చేసి పునఃపరిశీలించాలని కోరారు.
