contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పరిగిలో ఫ్లాగ్‌ మార్చ్‌ – ప్రజల్లో భద్రతా భరోసా కల్పించడమే లక్ష్యం : డీఎస్పీ శ్రీనివాస్

వికారాబాద్ జిల్లా పరిగిలో శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి శుక్రవారం ఫ్లాగ్‌ మార్చ్‌ను పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పరిగి పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై గాంధీ చౌక్, బహార్ పేట్ చౌరస్తా, ఖాన్ కాలనీ, టీచర్ కాలనీ బస్టాండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించేందుకు, వారి మధ్య శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు ఈ ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టాం,” అని తెలిపారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే పోలీస్ స్టేషన్‌కు రావాలనీ, న్యాయం కోసం నిర్భయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అలాగే, “తప్పు చేయనప్పుడు ఎవరూ తలవంచాల్సిన అవసరం లేదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని ఆయన హెచ్చరించారు.

ఈ ఫ్లాగ్‌ మార్చ్‌లో డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై సంతోష్ కుమార్, RAF అధికారులు, అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ నందువార్ రాంచెందర్, ఇన్‌స్పెక్టర్ రవిందర్ రోషన్, బి. రాజు, కెఆర్‌ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, చట్టాన్ని గౌరవించాలని పోలీసు అధికారులు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :