contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పదవీ విరమణ పొందిన పదిమంది పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన కమీషనర్ గౌష్ ఆలం

కరీంనగర్ జిల్లా: పదవీ విరమణ పొందిన వారిలో కరీంనగర్ లో సాయుధ దళ విభాగం లో ఆర్ ఎస్సై గా పనిచేసిన డి స్వామి (41 సంవత్సరాలు), ఉమెన్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై గా పనిచేస్తున్న సిహెచ్ శ్రీనివాస్ (41 సంవత్సరాలు), గన్నేరువరంలో ఏ ఎస్సై గా పనిచేస్తున్న పి. లక్ష్మీనారాయణ (35 సంవత్సరాలు), వీణవంక పి ఎస్ లో ఏ ఎస్సై పి . రవి (35 సంవత్సరాలు), గంగాధరలో ఏఎస్సై పి.కిష్టయ్య (35 సంవత్సరాలు), కరీంనగర్ టూ టౌన్ లో పనిచేస్తున్న ఏఎస్సై జి అనంత రెడ్డి ( (35 సంవత్సరాలు) సాయుధ దళ విభాగం లో ఏ ఎస్సై గా పనిచేస్తున్న ఏ శంకరయ్య ( 40 సంవత్సరాలు) , సాయుధ దళ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కె .సారంగపాణి ( 34 సంవత్సరాలు) , మానకొండూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎం డి బాగ్దాద్ ( 34 సంవత్సరాలు) , వీణవంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పి శ్రీనివాస్(34 సంవత్సరాలు) వీరంతా కలిసి పోలీసు శాఖకు సుదీర్ఘకాలం పాటు విశేషమైన సేవలు అందించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమైన ప్రక్రియ అని అన్నారు. అనేక సవాళ్లతో కూడుకున్న పోలీస్ ఉద్యోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి పదవీ విరమణ పొందడం ఒక గొప్ప విజయమని ఆయన కొనియాడారు. ఇంతకాలం వారు అందించిన సేవలకు వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉందని ఆయన గుర్తు చేశారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పోలీస్ కమీషనర్ స్వయంగా పదవీ విరమణ పొందుతున్న అధికారులను పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. వారికి జ్ఞాపికలను అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి (సంక్షేమం), కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడి సురేందర్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :