మంచిర్యాల జిల్లా.చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతానికి చెందిన బోల్లంపల్లి శ్రీనివాస్, అతని భార్య శశిదేవి దంపతులు ఉదయం ఇంట్లో వాటర్ పడుతుండగా షాక్ గురై మృతి చెందారు. పట్టంలో జ్వెల్లెరీ షాప్ నిర్వహణ తో పాటు తన నివాస ప్రాంతంలో వాటర్ ప్లాంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం తన ఇంట్లో ఉన్న వాటర్ జిఐ పైప్ తగిలి దంపతులు మృతి చెందడం తో కాలనీలో విషాదం నెలకొంది. మృతుడు శ్రీనివాస్ చెన్నూరు విశ్వకర్మ వర్తక సంఘం అధ్యక్షుడు ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉంటు దంపతులు ఇరువురు వ్యాపారం వ్యాహరాల్లో చురుకుగా ఉండేవారు. దంపతులు కరెంటు షాక్ తో మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మృతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
