కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ శ్రీ మానస దేవి ఆలయ పంచమ వార్షికోత్సవములు భాగంగా శుక్రవారం శ్రీ మానసా దేవి, అపురూప లక్ష్మి, సీతారామాంజనేయ, లక్ష్మీనరసింహస్వామి, శివపార్వతుల ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వీధుల గుండా మహిళలు కోలాటాల మధ్య ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బద్దం నరసింహారెడ్డి, చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, డాక్టర్ తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ ఏలేటి స్వప్న ఉపసర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
