contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ట్రాఫిక్ నియమాలపై విస్తృత అవగాహన డ్రైవ్

  • ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి – ఎస్.ఐ. పి. నారాయణరావు.

 

కురుపాం, పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్.ఐ.) పి. నారాయణరావు ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రత అలాగే ట్రాఫిక్ నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఈ డ్రైవ్ చేపట్టారు.కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్లే ప్రధాన రహదారిపై మంగళవారం ఎస్.ఐ. నారాయణరావు తమ సిబ్బందితో కలిసి వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ. నారాయణరావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే నాలుగు చక్రాల వాహనాలు నడిపే వ్యక్తులు విధిగా సీట్ బెల్ట్ ధరించాలని  సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగానే ఈ వాహన తనిఖీలను నిర్వహించామని, నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలకు బదులు మొదట అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.కేవలం ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారానే అనేక రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. ప్రతి ఒక్కరూ తమ ప్రాణాల భద్రత కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని ఆయన కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఇతర పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :