contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జియ్యమ్మవలసలో అంబరాన్నంటిన ‘సంక్రాంతి సంబరాలు…

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన జియ్యమ్మవలసలో మంగళవారం 2026 సంవత్సర సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సాహంగా సాగాయి.

మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కె. ధర్మారావు ఆధ్వర్యంలో, మండల విద్యాశాఖాధికారి-2 శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ముఖ్యంగా జానపద నృత్యాలు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే దేశభక్తిని చాటిచెప్పే గీతాలాపనకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి.

ఈ పోటీల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంఈఓ-2 శ్రీనివాసరావు మాట్లాడుతూ, మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మూడు బృందాలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాల్లో జియ్యమ్మవలస మండలం తరపున ఈ బృందాలు ప్రాతినిధ్యం వహించనున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. సంక్రాంతి సంబరాలు జియ్యమ్మవలసలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయని పాల్గొన్నవారు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :