contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్

కురుపాం:  ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందే ప్రతి అర్జీని అధికారులు చిత్తశుద్ధితో, నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. గురువారం కురుపాం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పాల్గొని ప్రజల వినతులను పరిశీలించారు.

బాధితులకు సంతృప్తికరమైన పరిష్కారం అవసరం

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేవలం అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించడం మాత్రమే సరిపోదని, బాధితుడికి క్షేత్రస్థాయిలో న్యాయం జరిగిందా లేదా అన్నదే ముఖ్యమన్నారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకూడదని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

68 వినతుల స్వీకరణ

ఈ ప్రత్యేక పీజీఆర్ఎస్ వేదికలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 68 వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి:

  • రైతు భరోసా: తుమ్మికమానుగూడ గ్రామానికి చెందిన ఆరిక బుద్దేశ్ తనకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా రైతు భరోసా అందలేదని ఫిర్యాదు చేశారు.

  • భూ పట్టాలు: సర్వే నెం. 92లో సాగు చేస్తున్న జీడి పంట భూమికి పట్టా ఇవ్వాలని నిమ్మక వెంకటరావు, 1982 నుంచి సాగులో ఉన్న భూమికి పట్టా మంజూరు చేయాలని కోమటిపల్లి చందు కలెక్టర్‌ను కోరారు.

  • రెవెన్యూ రికార్డులు: గుంజరాడ గ్రామానికి చెందిన హిమరిక సువర్ణ తన భూమికి సంబంధించిన 1బి, అడంగల్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలను చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :