కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, గునుకుల పల్లె, ముదిమాణిక్యం, గగిరెడ్డిపల్లి, సుందరగిరి, కొండాపూర్, రామంచ, ఓగులాపూర్, తదితర గ్రామాల్లో అకాల వర్షం ఒకసారిగా ఉరుములు మెరుపుల ఎదురు గాలులతో ఒక్కసారిగా భారీగా వర్షం కురవడంతో కోసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్లో తడిసి ముద్దైనాయి. కోత దశకు వచ్చిన వరి పంట సైతం నేల కురగడంతో రైతన్నకు భారీ నష్టం వాటిల్లింది, ఇప్పటికే మెడ విరుపు ఊస తిరుగుతూ ఎర్రబొమ్మడి రోగాలతో దిగుబడి సైతం తక్కువగానే వస్తుండడంతో ఈసారి పంట అతి తక్కువ రైతన్న చేతికంది దశలో ఇలా అకాల వర్షానికి మరింత నష్టం వాటిలిందని రైతులు లబో దిబో అంటున్నారు ఏది ఏమైనా ఎర్రటి వేసవి ఎండలో భారీ వర్షం కురవడంతో రైతన్నలకు మరింత నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
