హైదరాబాద్ / సికింద్రాబాద్ : చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుందని, ఈ స్టేషన్ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ స్టేషన్ ఫొటోలను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అద్భుతమైన… అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్ సిద్ధమైందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే పూర్తి కావాల్సిన ఈ రైల్వే స్టేషన్ త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రూ.434 కోట్ల బడ్జెట్తో ఈ స్టేషన్ను నిర్మించారు.
ఇది తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ కానుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ స్టేషన్లో 9 ప్లాట్ఫాంలు ఉన్నాయి. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందన్నారు. సుదూర ప్రాంత రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లను మారడానికి ఎంతోమందికి ఈ స్టేషన్ మరింత అనుకూలంగా ఉంటుందన్నారు.