- ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు భూ దందా
- సర్వే నంబర్ 96/A – 20 సెంట్లు భూమిని కబ్జా
- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పిడిఎం,ఎం సి పి ఐ,సిపిఐ, సిపిఎం డిమాండ్
రోజు రోజుకి ఏపీలో భూ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూములు మరోవైపు పేదల భూములను అడ్డగోలుగా కాజేస్తున్నారు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ముక్కరాల వెంకట నరసమ్మ భర్త శ్రీనివాసరావు కు చెందిన భూమి సర్వే నంబర్ 96/A లో వున్న 20 సెంట్లు భూమిని మంగళగిరిలో ఆర్టీఐ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రేపాల శ్రీనివాసరావు రెవిన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్ రికార్డ్స్ మార్చినట్లు ఆరోపిస్తున్నారు బాధితులు . 2/06/2022 లో సర్వేనెంబర్ 96/a లో 20 సెంట్ల భూమి ముక్క రాల వెంకట నర్సమ్మ పేరుతో ఆన్లైన్లో నమోదై ఉన్న భూమి 8 వనెల 2022లో సర్వే నంబర్ 96/a2 తో రేపాల శ్రీనివాసరావు పేరుపై ఆన్లైన్లో కొనుగోలుగా చేసినట్లు గా నమోదు చేయించుకోవడం ఆచ్చర్యనికి గురిచేసింది. ముక్కరాల వెంకట నరసమ్మ తన భూమిలోకి వెళ్ళగా రేపాల శ్రీనివాసరావు అనుచరులు కన్నయ్య ,శ్రీధర్ లు పోలీసుల సహకారంతో బెదిరింపులకు పాలుపడుతున్నారని, ఆ భూమిని తాను ఎవరికి అమ్మలేదని, ఎవరికీ అమ్మనటువంటి భూమి ఎలా వేరే వారి పేరుమీద ఆన్లైన్ లో నమోదైందో అర్ధం కావడం లేదని బాధితురాలు గోడును వెలిబుచ్చింది.
రేపాల శ్రీనివాసరావు పై వారికి సహకరించిన రెవిన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోని పేద కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పిడిఎం,ఎంసిపిఐ,సిపిఐ,సిపిఎం తదితర ప్రజాసంఘాల నాయకులు ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట గత 4 రోజులుగా దీక్ష నిర్వహిస్తున్న వారి కుటుంబానికి
మద్దతు తెలిపారు.
ఇకనైనా అధికారులు స్పందించి సమగ్ర సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకి భూమి అప్పగించాలని లేనిపక్షంలోప్రజాసంఘాల ఆధ్వర్యంలో వెంకట నరసమ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దసలవారీగా ఆందోళన చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ నాయకులు ఓర్చు కృష్ణ, సిపిఐ నాయకులు కృష్ణ నాయక్, సిపిఎం నాయకులు టి శ్రీనివాసరావు ,టి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.