contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుంట భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ క్రాంతి వల్లూరు

  • ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి.
  • మున్సిపాలిటీలు, పంచాయతీలో వున్నా అన్ని చెరువు లను కబ్జా కు గురి కాకుండా కాపాడాలి .
  • రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి.
  • ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.
  • ప్రభుత్వ భూములలో ఆక్రమించుకున్న వారికి నోటీసులు అందజేయాలన్నారు.
  • ప్రభుత్వ భూముల లో బోర్డు లు ఏర్పాటుచేయాలి .
  • అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన ..  జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ ,మున్సిపల్, పంచాయతీ రాజ్ ,ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవిన్యూ , నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ,మునిసిపల్ అధికారుల తో సమావేశం నిర్వహించారు .  ఈ సంధర్బముగా జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారం, సదాశివపేట , హత్నుర , కంది , కొండాపూర్ తదితర మండలాలలో చెరువు లు, కుంటలు ప్రభుత్వ ఇతర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు . జిల్లాలో సింగిల్ గుంట భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వాటి చుట్టూ ఫెన్సింగ్ , బోర్డులు ఏర్పాటు చేయాలని , అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చెరువులు కుంటలు ఎఫ్ టి ఎల్ పరిధిని అధికారులు సర్వే చేసి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పటాన్చెరు, జిన్నారం, సంగారెడ్డి తదితర మండలాలలోని పెద్ద చెరువుల రికార్డులను వెంటనే సమర్పించాలని రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు ఆదేశించారు. అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, మున్సిపల్ , ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములు పరిరక్షించాలి అన్నారు. మైనింగ్ అనుమతులకు రెవెన్యూ అధికారులు ఎన్వోసీ తప్పనిసరి అన్నారు. అనుమతి పొందిన మేరకే మైనింగ్ జరిగేలా అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో టాస్క్ ఫోర్స్ టీమ్ లు సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు . ఇతర ప్రభుత్వ స్థలాలు గ్రామస్థాయిలో కాపాడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ అధికారుల సహాయంతో నోటీసులు అందజేసి ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూముల లో బోర్డు లు ఏర్పాటుచేయాలన్నారు .
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ , మాధురి , డి ఆర్ ఓ పద్మజారాణి , ఆర్ డి ఓ వసంత , నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు , కుమారి , మునిసిపల్ అధికారులు , సంబంధిత మండలాల తహసీల్దారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :