కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు నిర్వదిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ నాయకులు సంఘీభావం తెలిపారు, ఈ సందర్భంగా అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులను వెట్టిచాకిరికి వాడుతున్నారని సరైన గుర్తింపు లేదని వారికి కనీస వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సరైన వేతనం చెల్లించి నెలవారి జీతం వారి అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, బిసి సెల్ మండల అధ్యక్షుడు కొలుపుల రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, మార్గం మల్లేశం, తిప్పర్తి పరిపూర్ణ చారి, వెంకటరమణ, కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు
