మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, మంచిర్యాల జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు బండ్ర లక్ష్మణ్ రావ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జాదవ్ వెంకట్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దూడ రాజనర్సుబాబు.విచ్చేసి, రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు. మాట్లాడుతూ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు ప్రమోషన్లు ఈ వేసవి సెలవులలో చేపట్టాలని కోర్టు కేసు ఉంది అని కాలయాపన చేయకుండా కోర్టు ద్వారా ముందస్తు అనుమతితో తక్షణ పరిష్కారం కోరుతూ వేసవి సెలవుల్లోనే బదిలీలు ప్రమోషన్లు చేయాలని విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా.మన-ఊరు మనబడిలో భాగంగా మంజూరు కాబడిన పాఠశాలలను పూర్తి చేయాలని.మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి తక్షణమే జిపిఎఫ్ ఆఫీసును మంచిర్యాల జిల్లాకు బదిలీ చేసి ఉపాధ్యాయుల యొక్క జిపిఎఫ్ సమస్యలను పరిష్కరించాలని. కోరడం జరిగింది తదనంతరం స్థానిక సమస్యలపై స్థానిక ఎంఈఓ శ్రీ రాధాకృష్ణమూర్తి కి మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ నాయక్ స్థానిక ఉపాధ్యాయ నాయకులు, ప్రముఖ అంబేద్కరైట్ మేకల రామస్వామి కొలకాని రాములు, తలండి శంకర్, సిడం మల్లయ్య, మరియు సభ్యులు పాల్గొని ప్రసంగించడం జరిగింది.
