contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నా నిర్ణయాలు సుదీర్ఘ ప్రయోజనాలు అందించేలా ఉంటాయి: సీఎం స్టాలిన్

తమిళనాడులోని పారిశ్రామిక నగరం హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. కృష్ణగిరి జిల్లాలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. హోసూరులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ఈ కీలక విషయాన్ని ప్రకటించారు.

ఈ సదస్సు వేదికగా తమిళనాడు ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. మొత్తం 92 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రాష్ట్రానికి రూ.24,307 కోట్ల పెట్టుబడులు రానున్నాయని స్టాలిన్ తెలిపారు. ఈ ఒప్పందాల ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 49,353 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పారిశ్రామిక, వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో 53 పెద్ద కంపెనీలతో రూ.23,303 కోట్లకు, ఎంఎస్‌ఎంఈ శాఖ ద్వారా 39 సంస్థలతో రూ.1003.85 కోట్లకు ఒప్పందాలు జరిగాయి.

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ మాదిరి తాను తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ఉంటాయని అన్నారు. గతంలో ఒక చిన్న పట్టణంగా ఉన్న హోసూరు, నేడు దేశవిదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే స్థాయికి చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో అధునాతన ఐటీ పార్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇటీవలే జర్మనీ, ఇంగ్లండ్ పర్యటనల ద్వారా రూ.15,516 కోట్ల పెట్టుబడులు సాధించామని, ఆ ఉత్సాహంతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా, 8,000 మందికి ఉపాధి కల్పించేలా రూ.1600 కోట్ల విలువైన నాలుగు కొత్త పథకాలకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తమ నాలుగన్నరేళ్ల పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 77 శాతం ఇప్పటికే ఫ్యాక్టరీల రూపంలో కార్యరూపం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :