- మూడు నెలలుగా అందని జిసిసి బియ్యం.
- 10 రోజుల నుండి అందని మధ్యాహ్న భోజనం.
- అధికారుల పర్యవేక్షణ లోపం, ఆకలితో విద్యార్థులు.
- జిల్లా అధికారులు స్పందించాలని తల్లిదండ్రులు డిమాండ్.
నిర్వాహకులు చేతులెత్తేయడం.. ప్రజాప్రతినిధుల పట్టించుకోకపోవడం.. ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం.. వెరసి చప్పడి గ్రామం ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.
అల్లూరి జిల్లా, అనంతగిరి: అనంతగిరి మండలం, కోనాపురం పంచాయతి చప్పడి గ్రామం లో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 35 మంది విద్యార్థులు శనివారం ఆకలి కేకలతో ప్లేట్లు పట్టుకొని నిరసన చేపట్టారు. పాత్రికేయులు ప్రధాన ఉపాధ్యాయులు ఎస్.నగేష్ ను ప్రశ్నించగా మూడు నెలల నుండి జిసిసి బియ్యం ఇవ్వక మధ్యాహ్నం భోజనం పది రోజుల నుండి పెట్టడం లేదని తెలిపారు. అధికారుల పర్యటన లోపం వల్ల గిరిజన విద్యార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయని విద్యార్థుల తల్లితండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు చొరవ తీసుకొని జిసిసి నుండి బియ్యం అందేలా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు, కోరుతున్నారు.