- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్
అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI 171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటనపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి. సుధాకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ విషాదకర ఘటనపై స్పందిస్తూ, “ఈ సంఘటన అత్యంత బాధాకరం. ఎంతోమంది ప్రయాణికుల జీవితాలను ఈ ప్రమాదం బలిగొనడం మాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది,” అని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వింధించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ప్రమాదం పట్ల దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికార వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయని సమాచారం.