ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ అభినందనలు తెలియజేశారు.
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ జీకి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన సుదీర్ఘ అనుభవం, విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి. రాజ్యసభలో సార్థకమైన, నిర్మాణాత్మక చర్చలకు ఆయన ప్రోత్సాహం కలిగి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా ఇది తోడ్పడుతుంది,” అని పేర్కొన్నారు.