contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సురభి లేబరేటరీ వద్ద ధర్నా … రాస్తా రోకో

సంగారెడ్డి హత్నూర మండలం: కాలుష్య పరిశ్రమ మాకొద్దు సురభి లాబరేటి పరిశ్రమ వద్ద చుట్టుపక్కల గ్రామస్తుల ధర్నా, రాస్తారోక నిర్వహించారు. వివరాల్లోకి తేలితే హత్నూర మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 529 ఏ ఏ బై వన్ లో ఐదు ఎకరాల భూమిలో నిర్మించబోయే సురభి లాబరేటరీ కాలుష్య పరిశ్రమ కాబట్టి నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని వడ్డేపల్లి సాదుల నగర్ కోనంపేట్ తుర్కళ్ ఖానాపూర్ తదితర గ్రామాల ప్రజలు ఆదివారం నాడు ధర్నా, రాస్తారోక నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ఈ పరిశ్రమ ఏర్పాటు అయితే సుమారు 5000 ఎకరాల వ్యవసాయ భూములు అదేవిధంగా తాగునీరు కలుషితమై ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కాబట్టి ఈ పరిశ్రమను 10 రోజులలో తొలగించకపోతే వారిని ఎక్కడ ఉంటే అక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. స్త్రీల గర్భసంచుల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి చొరవ తీసుకొని వెంటనే ఈ పరిశ్రమ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఈ పరిశ్రమ తొలగించే విధంగా చూడాలని లేని యడల పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చెరిచారు. ఈ ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ప్రజా ప్రతినిధులు వడ్డేపల్లి సాదుల నగర్ కోనంపేట పక్కల గ్రామస్తులు రైతులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :