పల్నాడు జిల్లా మాచర్ల : మాచర్ల పట్టణంలో అక్షర భారత్ తెలుగు డిజిటల్ న్యూస్ సీఈఓ పోలేపల్లి ఆనంద్ గృహప్రవేశ కార్యక్రమానికి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్ హాజరయ్యారు. శ్యాంప్రసాద్ మాట్లాడుతూ చిన్నస్థాయి రిపోర్టర్ గా చేరి నేడు ఉన్నత స్థాయికి చేరడం ఆనందదాయకమని, ఆనంద్ తన జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జర్నలిస్టులు, అధికారులు పాల్గొన్నారు.
