తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిసిల కు డిక్లరేషన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం అని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా మద్దిరాల గంగాధర్ గురువారము పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిసిల అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ బీసీ లను రాజకియంగా, ఆర్థికంగా, సామాజికంగా విద్యా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో రానిచ్చే విదంగా జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. బీసీ ల్లో 154 కులాలు ఉన్నాయని, వీరిని అభివృద్ధి చేయడానికి MLA లుగా చేసి మిగిలిన కులాలను MLC లుగా, కార్పొరేషన్ చైర్మన్లు గా, చట్ట సభలకు వచ్చే విధంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తామని హామీ ఇవ్వడం గొప్ప విషయం అని అన్నారు.
బీసీ లకు అంత్యంత ప్రాధాన్యత ఇస్తూ 50 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేస్తూ.. 3 వేల నుంచి 4 వేల రూ. పెంచుతామని హామీ ఇచ్చారని, దీంతో బిసి లంతా రుణపడి ఉంటామని, అంతేకాకుండా సమాజంలో గౌరవము, రక్షణ కల్పించేవిదంగా ప్రత్యేక పదునైన రక్షణ చట్టం తెచ్చి, సామజిక న్యాయ పరిశీలన కమిటీ వేసి బీసీ ల హక్కులను కాపాడుతామన్నారని, ఈ ప్రభుత్వంలో 24 % రిజర్వేషన్ను తగ్గించి 16800 మందిని బీసీ లకు అన్యాయం చేశారని, తిరిగి టీడీపీ ద్వారా 34% స్థానిక సంస్థల్లో నాయకత్వం పెంచేవిదంగా పునరుద్దరణ చేస్తారని అన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 30 వేల కోట్లు చొప్పున అయిదు సంవత్సరాలకు 1.5 లక్షల కోట్లు బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చేస్తామన్నారని గంగాధర్ తెలిపారు.