నెల్లూరు జిల్లా కందుకూరు : మణిపూర్ లో జరుగుతున్న అరాచకాన్ని నివారించాలని క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని జె.డి.బి.యం. టౌన్ బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ కాపరి రెవ. గడ్డం జాన్ మాట్లాడుతూ భారత దేశంలో క్రైస్తవుల పై దాడులు పెరిగిపోయాయని అందుకు ఉదాహరణ మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు అని, కుకీ తెగకు చెందిన క్రైస్తవులను దారుణంగా, కిరాతకంగా చంపుతూ స్త్రీలను వివస్త్రలను చేస్తూ బ్రాహ్మణ భావజాల వాదులు ఆనందం పొందుతున్నారని, ఈ చర్యలు సభ్య సమాజం తలదించుకునే చర్యలని, ఇటువంటి అరాచకాన్ని భారత ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేసి దోషులను కఠినంగా శిక్షించి క్రైస్తవులకు రక్షణ కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మద్ధాలి రమేష్, కొండేటి కరుణాకర్, వంగేవరపు జయకుమార్, చదలవాడ శ్యాం సుధాకర్, చదలవాడ కొండయ్య, స్త్రీల సమాజం మరియు చర్చి యవ్వనస్తులు ప్రతినిధులు పాల్గొని ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు.
