పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నందు నేడు జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం లో స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సొంత ఇంటి కల నేరవేరాలనే ఉద్దేశింతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్లు లేని నిరుపేదలకు ఉచితంగా ఇంటి స్థలాల పట్టాలను ఇస్తున్నారని, అదేవిధంగా అర్హత ఉండి ఎవరికైనా ఇంటి స్థలం రాకపోతే వాలంటీర్ల్ ల ద్వారా సచివాలయం లో దరఖాస్తు చేసుకుంటే అర్హత ను బట్టి ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అర్హులైన నిరుపేద మహిళలకు స్థలాల పట్టాలను పంపిణీ చేసారు.
