contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇదేమి కర్మ “పెద్దభైనపల్లి” పంచాయితీకీ : టీడీపీ మహిళా నేత”పులివర్తి సుధారెడ్డి”

తిరుపతి:  ఏళ్ల తరబడి పెద్దభైనపల్లి పంచాయితీనీ డ్రైనేజీ సమస్య పట్టిపీడిస్తున్నా…, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పాకాల మండలం, పెద్దభైనపల్లి పంచాయితీలో జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బైనపల్లి, కందేరి ఇండ్లు, గొల్లవాని ఇండ్లు, దాసరిపల్లి గ్రామాల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో ఫించన్లు తొలగించడం, ఇంటి పట్టాలు మంజూరు చేయకపోవడం దారుణమని అన్నారు. గడిచిన నాలుగేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో వున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పులివర్తి నాని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.తద్వారా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరింఛేందుకు వీలవుతుందన్నారామే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :