తిరుపతి : పాకాల ఫైర్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తూ ఇటీవల మరణించిన సురేంద్ర బాబు కుటుంబాన్ని ఫైర్ సిబ్బంది ఆదుకున్నారు. మృతుడి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఫైర్ చిత్తూరు ఉమ్మడి జిల్లా ఫైర్ సిబ్బంది మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జె రమణయ్య, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరా రెడ్డీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ జి. రామకృష్ణ రిటైర్డ్ లల్/ఎప్ విశ్వనాధం తో పాటు పాకాల ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.










