contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాడి రైతులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది: పులివర్తి నాని

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పరిధిలోని పదిపుట్లబైలు పంచాయతీ పదిపుట్లబైలు గ్రామంలో మినీ గోకులం షెడ్లను శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి పూర్ణ కుంభంతో అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలోని పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెమ నాయుడును కోరామన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, పశు సంవర్ధక శాఖ మంత్రి, రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వ రాకతో అన్ని రకాల సౌకర్యాలు చేకూరుస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో రాష్ట్రంలోని పాడి రైతులకు కావలసిన సదుపాయాల కల్పనలో శ్రద్ధ తీసుకుంటుదని గడిచిన 5 సంవత్సరాలలో గత పాలకులు స్వార్థ ప్రయోజనాల, నిర్లక్ష్య వైఖరితో రైతులను, రైతాంగాన్ని గాలికి వదిలేశారన్నారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వర్షాకాలంలో పాడి రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకొని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలానికి వి బి జి రాంజీ పథకం ద్వారా 267 గోకులాలకు సుమారు 7కోట్ల 72 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు . రైతులను లాభసాటిగా చేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని పండించడమే కూటమి ప్రభుత్వం లక్షం అని ఎమ్మెల్యే తెలిపారు. పాడి పరిశ్రమను ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :