contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఛత్తీస్‌గఢ్‌లో రైలు ప్రమాదం- ప్యాసింజర్‌, గూడ్స్‌ ఢీ- 8 మంది మృతి!

ఛత్తీస్‌గఢ్ రైలు ప్రమాదానికి ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడమే కారణమని రైల్వే బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రయాణికుల రైలు వెనుక నుంచి గూడ్సు రైలును ఢీకొనడంతో 8 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు.

కోర్బా జిల్లాలోని గెవరా నుండి బిలాస్‌పూర్‌కు ప్రయాణికుల రైలు వెళుతుండగా గటోరా-బిలాస్‌పూర్ స్టేషన్ మధ్య ఈ ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు కూడా అదే దిశలో కదులుతోందని అధికారులు పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ దుర్ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.

ప్రయాణీకుల కుటుంబాల సౌలభ్యం కోసం రైల్వే శాఖ హెల్ప్​ లైన్​ నంబర్లను విడుదల చేసింది.

  • బిలాస్‌పూర్ – 7777857335, 7869953330
  • చంపా – 8085956528
  • రాయ్‌గఢ్ – 9752485600
  • పెండ్రా రోడ్ – 8294730162
  • కోర్బా – 7869953330

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :