ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదానికి ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడమే కారణమని రైల్వే బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రయాణికుల రైలు వెనుక నుంచి గూడ్సు రైలును ఢీకొనడంతో 8 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు.
కోర్బా జిల్లాలోని గెవరా నుండి బిలాస్పూర్కు ప్రయాణికుల రైలు వెళుతుండగా గటోరా-బిలాస్పూర్ స్టేషన్ మధ్య ఈ ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు కూడా అదే దిశలో కదులుతోందని అధికారులు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ దుర్ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.
ప్రయాణీకుల కుటుంబాల సౌలభ్యం కోసం రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసింది.
- బిలాస్పూర్ – 7777857335, 7869953330
- చంపా – 8085956528
- రాయ్గఢ్ – 9752485600
- పెండ్రా రోడ్ – 8294730162
- కోర్బా – 7869953330










