మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వీధి కుక్కలు అదుపు తప్పి స్థానికులపై దాడి చేశాయి. ఒక్కసారిగా దాడి చేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానికులు తక్షణమే తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. సి.హెచ్.సి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్ పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. గాయాలు పెద్దగా ప్రాణాపాయం కలిగించే స్థాయిలో లేవని, అందరికీ అవసరమైన ఇంజెక్షన్లు, మందులు వేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రతి రోజూ పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను నియంత్రించకపోతే ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే అవకాశముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాసాయిపేట లో కుక్కలపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తూప్రాన్ డివిజన్ పరిధిలోనీ మాసాయిపేట మండల కేంద్రంలో లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. స్థానికులపై వీధి కుక్కలు ఆకస్మాత్తుగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడినవారిని తక్షణమే 108 అంబులెన్స్ ద్వారా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితులందరికీ తగిన విధమైన వైద్య సేవలు అందుతున్నాయని, ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. మిగతా రోగులంతా కొద్ది రోజుల్లో కోలుకుంటారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీధి కుక్కల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
