కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుల వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బొడ్డు సునీల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, మంగారపు అనిల్, ముడికే అజయ్,రాపోలు హరీష్ తదితరులు పాల్గొన్నారు
