contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆక్రమణ షాపుల తొలగింపు చర్యలు

విజయనగరం జిల్లా : రామభద్రపురం బైపాస్ వద్ద బుధవారం ఉదయం నుండి స్థానిక అధికారులు భారీ స్థాయిలో అక్రమ కట్టడాల తొలగింపు చర్యలు చేపట్టారు. గత దశాబ్ద కాలంగా రామభద్రపురంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండటం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ చర్యలకు రంగం సిద్ధమైంది.

ఈ కార్యకలాపాలను MRO సులోచన రాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బైపాస్ జంక్షన్ నుండి బొబ్బిలికి వెళ్లే మూడు ప్రధాన రోడ్ల వరకు, సుమారు 50 అడుగుల పరిధిలో ఉన్న అక్రమంగా ఆక్రమించిన స్థలాలను అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకుంది.

కట్టడాలను కూల్చివేయడానికి JCB యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ చర్యల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు SI ప్రసాద్ రావు సిబ్బందితో కలిసి కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్థానిక ప్రజలు ఈ చర్యలను మద్దతుగా స్వాగతించగా, కొంత మంది వ్యాపారస్తులు తమ జీవనాధారాలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఇది తప్పనిసరి చర్య అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ చర్యలతో రామభద్రపురం ప్రాంతంలో ట్రాఫిక్ నిర్వహణకు స్వల్ప రిలీఫ్ లభించే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలపై ఇది ఒక హెచ్చరికగా మారేలా చూస్తున్నారు స్థానిక యంత్రాంగం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :