కపిలేశ్వరపురం: కపిలేశ్వరపురం మండలం లోని ఇసుక ర్యాంప్ లను సోమవారం మైన్స్ శాఖ అధికారులు పరిశీలించారు. గనులు భూగర్భ శాఖ ఏ డి సాయి రామ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. అధికారులు బృందం కపిలేశ్వరపురం, తాత పూడి ఇసుక ర్యాంప్ లను పరిశీలించారు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఇక్కడి పరిస్థితి పై నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉన్నతాధికారులు సూచన మేరకు ర్యాంపు లు పరిశీలన కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఇరిగేషన్, మైన్స్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
