కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: ప్రపంచ యోగ దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలో యోగ దినోత్సవ కార్యక్రమం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి అందించిన కానుక యోగ మానసిక శారీరక ఆరోగ్యానికి వర ప్రదాయని యోగ ప్రతినిత్యం యోగా చేద్దాం ఆరోగ్యంగా వుందాం ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం యోగ ఒక పురాతన కాలం నుండి ఉన్నటువంటి ప్రక్రియ మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతుంది, శారీరక దృఢత్వానికి సహాయపడుతుంది, రోజు యోగా చేయడం వలన శరీరం మానసికంగా శారీరకంగా ఉత్తేజంగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సీనియర్ నాయకులు చింతం శ్రీనివాస్, దళిత మోర్ఛ ప్రధాన కార్యదర్శి యువమొర్చ కార్యదర్శి బోయిని అభిషేక్, బీజేవైఎం నాయకులు బోయిని హరీష్,కొంకటి అనిల్, మండల నాయకులు సత్తయ్య, హరీష్, ఓబీసీ జిల్లా ఓబిసి కార్యదర్శి మచ్చ బాలరాజు, బోయిని మల్లయ్య, నాగార్జున చారి, బండి తిరుపతి,కుర్రా హరీష్, బుర్ర శీను, బుర్ర రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
