కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన జీల రాజు అనే యువకుడు గుండెపోటుతో గురువారం కరీంనగర్ లోని మంకమ్మ తోట సాయిరాం ట్రావెల్స్ ఆఫీసులో కుప్పకూలి మృతి చెందాడు, కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో యూత్ నాయకుడిగా కొనసాగుతున్నాడు.మృతునికి భార్య, కుమారుడు,కూతురు ఉన్నారు.దీంతో గన్నేరువరంలో విషాదం నెలకొంది, రెండు సంవత్సరాల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా ఇప్పుడు ఇంట్లో మరో విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
