కరీంనగర్ జిల్లా: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశానుసారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అక్కెన పల్లి కుమార్. కరీంనగర్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా జాగిరి శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాడు వైఎస్ రాజశే ఖర్ రెడ్డి నేతృత్వం లో పనిచేశానని నేడు వైఎస్ షర్మిల నేతృత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని అన్నారు.నా నియామకానికి సహకరించిన వైఎస్ షర్మిల కి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్, జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి కుమార్
కి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
